
బోథ్ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు గురువారం సంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.



















