
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపికైంది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులు ఉన్నత విద్యను స్థానికంగానే అభ్యసించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.



















