
మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో సర్పంచ్ హరోన్ రషీద్ బాబా ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి యజమాని మొక్కలను సంరక్షించి పెంచాలని, తద్వారా స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు.



















