
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గురువారం మామడ, లక్ష్మణచాంద మండలాల్లో పర్యటించి, ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములు, రైస్ మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.



















