
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనలో భాగంగా, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) పిలుపునిచ్చారు. ఈ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.



















