
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు, హత్య రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కావలి నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడిపి కార్యకర్త చాట్ల వాసు హత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడే కారణమని ఆరోపించారు.



















