
డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్

డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్

లోకేశ్వరం మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధిగమించేందుకు ప్రతి చేనుకు ఫామ్పాండ్లు, ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ వ్యవస్థల ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించే చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఎయిర్టెల్ యూజర్లకు ముఖ్యమైన సూచన. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన నెట్వర్క్లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టనుంది. ఈ మార్పులలో భాగంగా, అపరిమిత 5G డేటా ఆఫర్ను స్మార్ట్ఫోన్ వినియోగానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.

ఎయిర్టెల్ యూజర్లకు ముఖ్యమైన సూచన. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన నెట్వర్క్లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టనుంది. ఈ మార్పులలో భాగంగా, అపరిమిత 5G డేటా ఆఫర్ను స్మార్ట్ఫోన్ వినియోగానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.

భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంచాలని ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లి గ్రామసభలో జలసిరి (VBG-RAM-G) కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల మరణించిన మండల కాంగ్రెస్ నాయకులు పడిగా సమ్మయ్య గారి మాతృమూర్తి పడిగా ముసలమ్మ దశదిన కర్మల నిమిత్తం పార్టీ నాయకులు బియ్యం అందజేశారు.

భవష్యత్ తరాలు నీట భద్రత ల్పంచే ల్ష్యంతో, ప్రత నీట బొట్టును భూమలో ఇంంచేలా 'జలసర' ాయ్రమాన్న గ్రామపంచాయతీ అధారులు చేపడుతున్నారు ుంటాల మండల ేంద్రంలో నవహంచన గ్రామసభలో, ప్రత ఇంట మ్యాజ్ సో్పట్, ప్రత వ్యవసాయ ్షేత్రాన ఫామ్పాండ్, ప్రభుత్వ భవనాలు రూఫ్టాప్ రైన్వాట హావెస్టంగ్ వంట పథాలపై అధారులు వవరంచారు

నిర్మల్లో తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తమ పెండింగ్ బకాయిల చెల్లింపునకు సంబంధించి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.జె.సంగీత తెలిపారు. వివిధ విభాగాల్లో పలు ఖాళీలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నర్సులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపట్టింది. TOMCOM-గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఉద్యోగాలకు అర్హులైన నర్సులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు భంగం కలగకుండా కమిటీకి చట్టబద్ధత కల్పించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ ప్రతినిధులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సోమవారం సమావేశమైంది.

నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తులు సోలార్ ప్లాంట్ పనుల విషయంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పనులు ప్రారంభించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖానాపూర్ానాపూర పటటణంలో అసంపూరతిగా నిలిచిపోయిన పరధాన రోడడు విసతరణ పనులను వెంటనే చేపటటాలని కోరుతూ సథానికులు మునసిపల చైర పరసన అంకం మౌనికకు సోమవారం వినతిపతరం సమరపించారు. రోడడు పనులకు ఆటంకంగా ఉనన విదయుత సతంభాలను తొలగించి, పనులు వేగవంతం చేయాలని వారు విజఞపతి చేశారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని, రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ పేపర్ లీక్పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు, హత్య రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కావలి నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడిపి కార్యకర్త చాట్ల వాసు హత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడే కారణమని ఆరోపించారు.

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిపుణుల కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఈ నెల 22న ప్రజాభవన్లో నిపుణుల కమిటీ తొలి సమావేశం జరగనుంది.

భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ తన డ్యూటీని ప్రారంభించారు. హైదరాబాద్ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన సందడి చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా అక్కడే గడిపిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

బాసర మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జి. మైసాజీ మాట్లాడుతూ, ఆధునిక బోధనా పద్ధతులను తరగతి గదిలో అమలు చేసి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. తిర్యాణిలో అర్ధరాత్రి కుండపోత వాన కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న లో-లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

నిర్మల్ జిల్లాలో బోడ కాకర కాయకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. భైంసా సోమవారం మార్కెట్లో కిలో రూ.400 ధర పలికింది. ఆరోగ్య ప్రయోజనాలు, షుగర్ నియంత్రణ గుణాల వల్ల దీనికి డిమాండ్ పెరిగింది.