
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువకులు వరద కాలువలో జారిపడి గల్లంతవ్వగా, వారిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.



















