
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం అయిన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై హర్షం వ్యక్తమైంది. నిర్మల్ డిపో వద్ద ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.



















