
విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు, ఆయన నివాసంతో పాటు సోదరుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడినట్లు సమాచారం.



















