
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రతను పరిరక్షించేందుకు మహిళా ఎస్సై అమూల్య చేపట్టిన వినూత్న చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారని అందిన సమాచారం మేరకు, ఆమె స్వయంగా రంగంలోకి దిగి ఆకతాయిలకు అడ్డుకట్ట వేశారు.



















