
బీసీ నేత, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం () ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సురేఖపై క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించిన అధిష్టానం, నేరుగా చర్యలు కాకుండా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఆమెను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.



















