
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో దశ ప్రక్రియపై శనివారం ఒక సాధారణ సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు హాజరయ్యారు.



















