
భార్యపై అనుమానంతో కక్ష పెంచుకున్న భర్త, అర్థరాత్రి దాటిన తర్వాత బండ రోలుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్ లోని ఒక ఇంటి రెండవ అంతస్తులో జరిగింది. మస్తాన్ దాడిలో తీవ్ర గాయాలైన మల్లికను మొదట రూయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.



















