
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మే 14న హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది.



















