
శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం అభివృద్ధిపై జరుగుతున్న విమర్శలకు టీం ఘాటుగా స్పందించింది. కొందరు వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో ధర్నాలు, రాస్తారోకోలు వంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని విమర్శించింది. గత మూడేళ్లుగా దేవస్థానంలో జరిగిన అభివృద్ధి పనులను సందర్శిస్తే వాస్తవాలు తెలుస్తాయని తెలిపింది.



















