బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
బైంసా పట్టణంలో మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను సంఘం అధ్యక్షుడు తోట రాము మండల రెవెన్యూ అధికారి శశిభూషణ్ దృష్టికి తీసుకెళ్లారు.
బైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట రాము ఫోన్ ద్వారా మండల రెవెన్యూ అధికారి శశిభూషణ్ దృష్టికి తీసుకెళ్లారు.
అర్హులైన వారి దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు. ప్రజలు తమ వివరాలను సరిచూసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












