నిర్మల్, జూన్ 27
రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం దివ్య నగర్ కాలనీలో మురికి కాలువలు, నాళాల పూడిక తీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం దివ్య నగర్ కాలనీలో మురికి కాలువలు, నాళాల పూడిక తీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటూ, నీటి నిల్వలు లేకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఈ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.








