ముధోల్, గురువారం
ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామ ప్రజలు రానున్న మూడు రోజుల్లో కురిసే భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, చెరువులు, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మూడు రోజుల్లో వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువకులు, గ్రామస్తులు చెరువుల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాల వద్ద, పాత ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.












