ముధోల్ నియోజకవర్గ పరిధిలోని బైంసా పట్టణం, దాని పరిసర ప్రాంతాల కృపా గ్యాస్ వినియోగదారులకు సంస్థ మేనేజర్ అజయ్ పాఠక్ ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో స్వల్ప జాప్యం ఏర్పడవచ్చని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా IOC బాటిలింగ్ ప్లాంట్ నుంచి గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు కృపా గ్యాస్ మేనేజర్ అజయ్ పాఠక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఓపికతో, గౌరవపూర్వకంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సిలిండర్ బుకింగ్ కోసం, వినియోగదారులు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా సిలిండర్ పొందిన 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ కోసం మిస్డ్ కాల్ నంబర్ 84549 55555, వాట్సాప్ నంబర్ 75888 88824 (REFILL అని టైప్ చేసి పంపాలి), మరియు ఆల్ ఇండియా IVRS నంబర్ 77189 55555 అందుబాటులో ఉన్నాయి.
డెలివరీ సమయంలో DAC (Direct Authentication Code) OTP ద్వారానే సిలిండర్లు అందించబడతాయని, బుకింగ్ లేని వినియోగదారులకు DAC కోడ్ లేకుండా సిలిండర్ ఇవ్వబడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రతి వినియోగదారుడికి సిలిండర్లు నిర్దిష్ట తేదీల ప్రకారం క్రమానుగతంగా అందజేయబడతాయని తెలిపారు. డెలివరీ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని గ్రామ ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.












