** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
దేశీయంగానే ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ నోట్లను తీసుకురానుంది.
దేశీయంగానే ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద మార్పులకు ఆర్బీఐ పునాది వేస్తోంది. సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ నోట్లను తీసుకురానుంది.
ఈ కొత్త నోట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానుంది. నోట్ల ముద్రణ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, దేశంలో పాలిమర్ సబ్స్టేట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రపంచ వ్యాప్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈఐఓ) జారీ చేసింది.












