నిజామాబాద్, 2026-08-31
నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆధ్వర్యంలో కీలకమైన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జైలులోని భద్రతాపరమైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో భాగంగా నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., కేంద్ర కారాగారంలోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర కారాగారంలో ప్రస్తుతం అమలులో ఉన్న భద్రతా విధానాలు, బందోబస్తు నిర్వహణ, సిబ్బంది విధుల కేటాయింపు, ప్రవేశనిష్క్రమణ మార్గాలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జైలు భద్రత విషయంలో ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.
సీసీ కెమెరాల పనితీరుపై పరిశీలన
కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పరిసర ప్రాంతాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, కీలక ప్రదేశాలు నిరంతరం కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి నిర్వహణ, రికార్డింగ్ వ్యవస్థ, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ప్రహరీ గోడ, బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కేంద్ర కారాగారం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ భద్రతను కూడా కమిషనర్ పరిశీలించారు. ప్రహరీ గోడ వద్ద ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. జైలు వద్ద విధులు నిర్వహిస్తున్న బందోబస్తు సిబ్బంది అప్రమత్తత, విధుల నిర్వహణ, పహారా విధానాలను సమీక్షించారు.
హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్ పరిశీలన
కేంద్ర కారాగారంలోని హాస్పిటల్ మరియు డీ-అడిక్షన్ సెంటర్లను కూడా పోలీస్ కమిషనర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పర్యవేక్షణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారికి భద్రతతో పాటు అవసరమైన సేవలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కేంద్ర కారాగారం అత్యంత కీలకమైన భద్రతా ప్రదేశమని, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని తెలిపారు. జైలు అధికారులు, పోలీస్ శాఖ మరియు భద్రతా సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తే భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.












