Warangal/Nallabelly (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
లింబా (బి) గ్రామ అభివృద్ధికి గత రెండేళ్లలో కోటి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, శివాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ గ్రామానికి రెండు సంవత్సరాల్లో కోటి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, తమ గ్రామాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని లింబా (బి) సర్పంచ్ తో పాటు గ్రామస్తులు అన్నారు.
శనివారం బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో శివాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నారని కొనియాడారు. సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనం, గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు ఇచ్చారని, ఆయనకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువతో సత్కరించి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.












