వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఐదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కామారెడ్డిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళ, తన సహజీవన భాగస్వామి నర్సింహులు చేతిలో తన ఐదేళ్ల కుమారుడు శ్రావణ్ను కోల్పోయింది. లక్ష్మికి భర్తతో విడాకులు కాగా, ఆమెకు సమీర (8), శ్రావణ్ (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా నర్సింహులుతో సహజీవనం చేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
లక్ష్మి కుమారుడు శ్రావణ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నర్సింహులు, బాలుడిని హత్య చేయాలని పథకం పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, బాలుడి కళ్ళలో కారం చల్లి, గొంతు నులిమి, కర్రతో తలపై కొట్టి, నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు.











