ఖానాపూర్, 2026-08-05
ఈనె 10వ తేదీన ఆదిాబాద్ పట్టణంని సెంట్ర్ హా్ లో లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యం నిర్వహించనున్న జి్ా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాని పార్టీ నాయకుు పిుపునిచ్చారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మె్యే క్యాంపు కార్యాయం నిర్మ్ జి్ా డీసీసీ, ఖానాపూర్ ఎమ్మె్యే గౌరవ వేడమ బొజ్జు పటే్ గారిని ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుు సమతా సుదర్శన్ నేతృత్వంని బృందం కిసి ప్రత్యేక ఆహ్వానం అందించింది.
ఈనెల 10వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ జిల్లా డీసీసీ, ఖానాపూర్ ఎమ్మెల్యే గౌరవ వేడమ బొజ్జు పటేల్ గారిని ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సమతా సుదర్శన్ నేతృత్వంలోని బృందం కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించింది.
సమావేశం లక్ష్యాలు
ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొని, పార్టీ బలోపేతానికి, ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్ట శ్యాంసుందర్, రాష్ట్ర సెక్రటరీ కొంతం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాసమల్ల అశోక్, ఖానాపూర్ మండల అధ్యక్షులు సంఘర్తి రాజన్న, ముధోల్ నియోజకవర్గ అధ్యక్షులు జంగ్మే సాహెబ్ రావ్, డీసీసీ ఎక్స్క్యూటివ్ మెంబర్ జిన్నారపు శంకర్, టౌన్ ప్రెసిడెంట్ గొర్రె గంగాధర్, సీనియర్ నాయకులు నేత శ్యామ్, ద్యావతి రాజేశ్వర్, మ్యాదరి రాజేశ్వర్, మెస సతీష్ తదితరులు పాల్గొన్నారు.












