Palnadu/Amaravathi (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
తమ కుమార్తెకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరో బిడ్డను పెంచడం ఆర్థికంగా, సామాజికంగా భారమని భావించిన ఒక జంట, కడుపులోని బిడ్డను అబార్షన్ చేయించుకుంది. ఈ అబార్షన్ కోసం వారు ఏకంగా RMP డాక్టర్కు రూ.50,000 చెల్లించారు. కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లో అని తెలుసుకోవడానికి రూ.20,000, అబార్షన్ చేయడానికి రూ.30,000 ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమ కుమార్తెకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరో బిడ్డను పెంచడం ఆర్థికంగా, సామాజికంగా భారమని భావించిన ఒక జంట, కడుపులోని బిడ్డను అబార్షన్ చేయించుకుంది. ఈ అబార్షన్ కోసం వారు ఏకంగా RMP డాక్టర్కు రూ.50,000 చెల్లించారు. కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లో అని తెలుసుకోవడానికి రూ.20,000, అబార్షన్ చేయడానికి రూ.30,000 ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పాలనాడు జిల్లాలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆడపిల్లలంటే సమాజంలో వివక్ష, వారిని పెంచడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మరిన్ని ఆడపిల్లలను కని పెంచడం కష్టమని భావించిన తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారని బాధితురాలి తల్లి శ్రావణి పేర్కొన్నారు. RMP డాక్టర్ల నిర్లక్ష్యం, చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడటంపై ఈ సంఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అబార్షన్లు చట్టవిరుద్ధమని, అవి ఆరోగ్యానికి కూడా హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.










