ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ నీరు రాక, అపరిశుభ్రతతో దోమలు, పాములు, తేళ్లు పెరిగిపోవడంతో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అఖిలభారత రైతు కూలీ సంఘం విమర్శించింది.
ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ మంచినీళ్లు రావడం లేదు. దీనిపై అనేకసార్లు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా వ్యవస్థ కొనసాగుతోందని తెలిపారు. ఈ విషయంపై, అనేక సమస్యలపై ఖానాపూర్ ఎంపీడీవో దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయినా ఖానాపూర్ ఎంపీడీవో ఒక్కరోజు కూడా గోసంపల్లి గ్రామపంచాయతీకి వచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
అపరిశుభ్రత, దోమల బెడద
ఈ గ్రామంలో రోడ్ల ఇరువైపులా ముండ్ల పొదలు, చెట్ల కంపలు, గడ్డి పెరిగి ఉండటం వలన అనేక దోమలు తయారయ్యాయని, ఇప్పటివరకు గడ్డి మందు కొట్టిన దాఖలాలు లేవని తెలిపారు. రోడ్ల ఇరువైపులా చెత్తాచెదారం ఉండటం వలన దోమలతో పాటు పాములు, తేళ్లు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యలు
ఈ విషయాలపై ఎన్నిసార్లు మొరపెట్టుకొని చెప్పినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, గ్రామ ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఉండటం వలన మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయని తెలిపారు.
అధికారులకు హెచ్చరిక
ఇప్పటికైనా ఎంపీటీవో, పంచాయతీ కార్యదర్శి తక్షణమే పరిశుభ్రత చేపట్టాలని, గడ్డి మందు కొట్టించాలని, రోడ్ల ఇరువైపులా చెత్తాచెదారం లేకుండా చేయాలని కోరారు. ఒకవేళ చేయని యెడల నిర్మల్ జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని అఖిలభారత రైతు కూలీ సంఘం అదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.ఆర్. ఉపాలి అన్నారు.












