డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బైంసా పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఆయన మార్గంలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని తెలిపారు.
బైంసా పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులను ప్రభుత్వం ద్వారా త్వరలోనే మంజూరు చేయించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












