
మిర్యాలగూడలో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశమిస్తూ పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా విద్యార్థులు ఆటలు, కంప్యూటర్ సైన్స్, యోగా వంటి వివిధ రంగాలలో శిక్షణ పొందవచ్చని తెలిపారు.



















