
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీ పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు రూ.38 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.



















