
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



















