
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియ వంద శాతం పూర్తయిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజురా సత్యం తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జేకే నగర్, రాజీవ్ నగర్, విద్యానగర్ కాలనీలలోని 235, 236 పోలింగ్ కేంద్రాల్లోని ఓటరు జాబితా సవరణ పనులు విజయవంతంగా ముగిశాయి.



















