
ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1న తలపెట్టిన ధర్నా నోటీసును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు అందజేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పిఆర్టియు.టిఎస్. రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.



















