
కొండమల్లేపల్లిలో గుర్తింపు రద్దు అయిన 'ఎస్పిఆర్ ఉన్నత పాఠశాల'ను తక్షణమే మూసివేసి, సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు కేతవాత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. అక్రమ అనుమతులిచ్చిన నాటి అధికారులపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పాఠశాల మూసివేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



















