
వరి నాట్ల సమయంలో పొలాలకు వెళ్లే ట్రాక్టర్లకు కేజీ వీల్స్ అమర్చి బీటీ రోడ్లపై నడపకుండా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని లోకేశ్వరం ఎస్సై ప్రదీప్ కోరారు. కేజీ వీల్స్తో రోడ్లపై ప్రయాణించడం వల్ల బీటీ రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని, దీంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.



















