
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు తర్వాత, అందుకు సంబంధించిన కమిషన్ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ప్రాథమిక సహకార సంఘాలు (పిఎసిఎస్) ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, నిర్వీర్యం అవుతున్నాయని వనపర్తి జిల్లా రాజనగరం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు మానాజీపేట రఘువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు పరపతి సంఘాలు, పిఎసిఎస్ సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని, రైతులకు సకాలంలో పంట రుణాలు అందించాల్సిన సింగిల్ విండో సొసైటీలు దివాలా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



















