
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా రూ.12.88 లక్షల విలువైన 112 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బాధితులకు అందజేశారు.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా రూ.12.88 లక్షల విలువైన 112 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బాధితులకు అందజేశారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక సైబర్ జాగృతి దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆవిష్కరించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

తెలంగాణ సాహిత్య రంగంలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.

మందపల్లి అంగన్వాడీ కేంద్రం-1లో మంగళవారం తల్లి పాల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిపాలు శిశువులకు అత్యంత శ్రేష్ఠమైన ఆహారమని, పుట్టిన వెంటనే తల్లిపాలను అందించడం వల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని తల్లులకు అవగాహన కల్పించారు.

తాను తొలి వైద్యురాలిగా సేవలందించిన ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిని 50 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోకుండా, రోగుల సేవకు తోడ్పాటు అందించిన ఓ వైద్యురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. 1974 నుంచి 1976 వరకు ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి వైద్యురాలిగా సేవలందించిన డాక్టర్ కర్ణకోట కళావతి, ఇటీవల బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నిరవధిక ధర్నాలో పాల్గొనేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి సహారా బాధితులు, సిబ్బంది పెద్ద ఎత్తున తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఈ ధర్నా జరగనుంది.

పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 7న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనుంది. ఆరోగ్య పథకం అమలు, వేతన సవరణ వంటి అంశాలపై ప్రభుత్వంపై పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆర్థిక పరిపాలన అధికారిణిగా శ్రీమతి సిద్ధ పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

తూర్పు తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు మరో రెండు మూడు గంటల్లో తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దక్షిణ, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. పసి పిల్లల తల్లులు, తండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు, 7319 నంబర్ గల ప్రైవేట్ ఆర్టీసీ బస్సును గత పది సంవత్సరాలుగా నడుపుతూ, నేడు వెలువడిన ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భూంపల్లి గ్రామస్తులు ఆయనను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తాకట్టు పెట్టారని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన అవమానకరమైన ఓటమి రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్లో బేబీ ఒక పోస్టు చేశారు.

లోకేశ్వరం మండల జనరల్ బాడీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్కు విన్నవించారు.

నిర్మల్ జిల్లాలోని గజ్వేల్ గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న ఆశన్న (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఖానాపూర్ పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ఆధ్వర్యంలో కోతుల పట్టివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక సిబ్బందితో పట్టణంలోని వివిధ వార్డుల్లో కోతులను పట్టించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు ప్రారంభించారు.

కూలీ పనులకు వెళ్లి మృత్యువు ఒడికి చేరిన విషాద ఘటన ఉట్నూర్ మండలం నర్సాపూర్లో చోటుచేసుకుంది. ఇసుక తోడుతుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు.

వేల్పూర్ కు చెందిన శ్రీ గోవింద గిరి దివ్య యోగాశ్రమము వ్యవస్థాపకులు, కుండలిని జ్ఞానయోగి, అవధూత బ్రహ్మ అయిన శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి శిష్యులు ఆషాడమాసం సోమవారం రోజున వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ శివారులో గల శ్రీ సంత మల్లన్న స్వామి (గుట్ట) దేవాలయం ప్రాంగణంలో వనభోజనాలకు తరలి వెళ్లారు. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో వారు స్వయంగా వంటలు చేసుకున్నారు.

హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పనకు సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తానూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ఆమోదం విషయంలో గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విఠల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. టెండర్ ఆమోదం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.