
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పలు సూచనలు చేశారు.



















