
పేదలకు ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే మంజూరు చేయాలని మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ కార్యాలయంలో ఇందిరమ్మ అధికారి పి.డి. విజయ్ పాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.



















