
మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వీవోఏలు (గ్రామ సంఘాల సహాయకులు) తమకు న్యాయం చేయాలంటూ నిరవధిక సమ్మెకు దిగారు. సారంగాపూర్ మండల వీవోఏ కమిటీ ప్రతినిధులు ఈ సమ్మెను ప్రారంభించారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించి, అర్హులైన వీవోఏలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.



















