
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2027 మే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియపై విపక్షాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.



















