
ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగై, వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఒంటరి కుటుంబాల ఉధృతి పెరిగిపోతోందని తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా "కుంటుబడిన కుటుంబం" అనే కవిత ద్వారా కుటుంబ విలువల క్షీణతపై ఆయన స్పందించారు.



















