
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాఠశాలలో కనీస అవసరమైన టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



















