
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి వరంగల్, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.



















