
వన మహోత్సవం–2026లో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం మహారాష్ట్ర సరిహద్దులోని తానూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి సుమారు 300 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఎస్పీ సూచించారు.



















