
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో, జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలను బంద్ చేయాలని పిలుపునిచ్చాయి.



















