
మిర్యాలగూడలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయనున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.



















