
హింసాత్మక నిరసనలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తుల పాస్పోర్ట్లను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా విధ్వంసక చర్యలకు పాల్పడేవారికి గట్టి సంకేతాలు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది.



















