
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో మేడిన్ ఇండియా వస్తువులను ప్రపంచవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, 2014లో ప్రారంభమైన ఈ నినాదం ఏడేళ్లుగా ఆచరణలో పెద్దగా ముందుకు సాగలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ పోటీతత్వ సూచికల్లో భారత్ వెనుకబడటం, వాణిజ్య లోటు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.



















