
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వరుస సంతాన నష్టంతో బాధపడుతున్న రమేష్, జ్యోతి దంపతుల మూడో సంతానం తీవ్ర అనారోగ్యంతో నిజామాబాద్లోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. పసికందు ప్రాణాలను కాపాడేందుకు ఆపన్నహస్తం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.



















