
చిట్యాల మండలం వేలిమినేడు శివారులోని నోష్ లాబ్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబానికి కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై, పీసీబీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



















